పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతంలో మహిళలు రోడ్డు వేయాలని నిరసన తెలిపారు జగ్గయ్య చెరువు ప్రాంతంలో 30 ఏళ్లగా నివాసం ఉంటున్నామని నాయకులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటివరకు రోడ్డు వేయడం లేదన్నారు తమ ప్రాంతానికి మంజూరు చేసిన రోడ్లే వేరే ప్రాంతంలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరారు.