జిల్లాలో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఖష్బూగుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ఈ నెల 30వ తేదీన జిల్లాలోని జైనూర్ మండలం పట్నాపూర్ లో గల పూలాజీ బాబా సంస్థాన్ లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు,నిర్వహణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.