Download Now Banner

This browser does not support the video element.

ములుగు: యూరియా సరఫరా లో ప్రభుత్వాలు విఫలం : సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ

Mulug, Mulugu | Sep 1, 2025
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు సోమవారం రోజున ఉదయం 11 గంటలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ... జిల్లాలో యూరియా కొరత ఉందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాకు 15-20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, ఇప్పటికీ 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారని అన్నారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు యూరియా అవసరమైన సమయంలో ప్రభుత్వాలు తేవడం లేదని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us