Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జన వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అర్బన్ సిఐ జయానాయక్

Rayadurg, Anantapur | Aug 31, 2025
రాయదుర్గం పట్టణంలో జరిగే ఐదవ రోజు గణేష్ నిమజ్జన వేడుకల్లో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ సిఐ జయానాయక్ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించి ఆ వాహనాల్లో జనాలను తీసుకెళ్లడం చేయరాదన్నారు. నిమజ్జనం, ఊరేగింపులలో చిన్నారుల పట్ల పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిగేందుకు పోలీసు అధికారులతో సహకరించాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us