Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
మానవత్వం మంట కలిసింది... తోడుంటాడని నమ్మి సహజీవనం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యుల మందలింపుతో వదిలేశాడు... మనస్థాపానికి గురైన ఆమె సూసైడ్ చేసుకొని మరణించింది... మృతదేహాన్ని అంబులెన్స్ వచ్చేదాకా కూడా చూడకుండా ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకులు రోడ్డు పాలు చేసిన విషాద ఘటన అందర్నీ కలిచి వేస్తుంది... వివరాల మేరకు... నెల్లూరు జిల్లా కలిగిరి కి చెందిన మహిళ ఓ యువకుడితో సహజీవనం చేస్తుంది. గత కొంతకాలంగా వీరి రహస్య సంసారం అన్యోన్యంగానే సాగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు మహిళను తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.