ప్రభుత్వ ఆసుపత్రులలో మాత, శిశు మరణాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వైద్య సిబ్బంది తీసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశించారు. పోలాకి ప్రభుత్వ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందించడంతో పాటు వారితో మమేకమై సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.