Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
అరకులోయ నియోజకవర్గంలో చేపట్టనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంపై ప్రజల అభిప్రాయాల్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొర అన్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ను అనుసరించి ప్రస్తుతం ప్రజల్లో అభిప్రాయాలను తెలుసుకోమని జిల్లా కలెక్టర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో గిరిజనుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాము కూడా అదే స్టాండ్స్ తో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు అన్నారు