పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు.