తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి పుట్టుక చావులు కాకుండా బతకంతా తెలంగాణకి ఇచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజీ అని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా కవి స్వర్గీయ కాలోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమకారుడు పద్మ విభీషణ్ పురస్కారం పొందిన మహనీయుడు ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలని తెలిపారు.