శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, శాప్ చైర్మన్ రవి నాయుడు, డి ఎస్ డి ఓ ప్రభులు సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరిలో విద్యార్థుల క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, కోచింగ్ అందించడం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.