భీమవరం నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 4:30 కు భీమవరం మండలం నరసింహాపురంలో జనసేన స్థూపం, జెండాను ఆయన ఆవిష్కరించారు. ప్రతి సామాన్యుడి అభ్యున్నతికి జనసేన కృషి చేస్తుందని, సంక్షేమ పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.