కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా// జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ఎఫ్ఆర్ఎస్ (FRS – Face Recognition System)ను ప్రవేశపెట్టారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానం అమలులోకి వచ్చింది. కళాశాలలోని విద్యార్థులందరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను లెక్చరర్లు ప్రారంభించగా, ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో మొబైల్ యాప్ ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు.