వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను బుధవారం ఎస్పీ స్వయంగా సందర్శించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి సూచనలు చేసి, అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు.