ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలోని గుడిహత్నూర్, సిరికొండ, నార్నూర్, నేరేడిగొండ మండలాలలో పోలీసులు ఏకకాలంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 మంది నిందితులపై కేసులు నమోదు చేసి, 41 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.