దుండిగల్ లోని నాగులూరు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందడం అత్యంత బాధాకరమని కుత్బుల్లాపూర్ గణేష్ ఉత్సవ కో కన్వీనర్ ఆకుల సతీష్ అన్నారు. బారికెట్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు. మృతి చెందిన వారు పేదవారు కావున వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు.