ఆదోని పట్టణ శివారు రాయనగర్ వద్ద హనుమాన్ నగర్కు చెందిన అశోక్(34) ఐదు రోజుల క్రితం ఇసుక టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూలులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. తలకు బలమైన గాయంతో మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మెరుగైన వైద్యం అందించారు.అయిన్పటికీ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.