హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ఆదిత్య నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి శనివారం మధ్యాహ్నం కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్యలు సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికూరు తెలుపగా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.