కోటబొమ్మాళి మండలం వైశ్య వీధికి చెందిన చిన్న పిండి మిల్లి నడుపుతున్న మల్ల రమేశ్ (45) సోమవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. పిండి మిల్లు పై ఆధారపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తూ ఉన్నారు. మిల్లు స్టార్ట్ చేసిన సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.