ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అర్హత కలిగి ఉన్న వారి పింఛన్లను ఏ విధంగా తొలగిస్తారని ఒంగోలులోని సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలుగా పింఛనందుకున్న వికలాంగులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరి పింఛన్లను నిలిపివేశారు. దీంతో ఏ ప్రతిపాదన ఆ పింఛలను నిలిపివేశారని చెప్పాలని అధికారులను నిలదీశారు. నిజమైన లబ్ధిదారులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.