నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ (జిల్లా ఇన్ చార్జి మంత్రి) జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు వినోదం, విశ్రాంతి కలిగించేలా లేక్ వ్యూ పాయింట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి, పచ్చదనం పెంపు, పట్టణ సుందరీకరణ దిశగా ఇటువంటి ప్రాజెక్టులు కీలకమని అన్నారు.