జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామ మాజీ ఉపసర్పంచ్ నోముల శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటీవల అరుణాచలం యాత్రలో రోడ్డు ప్రమాదంలో గాయపడి, హైదరాబాదులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపిటిసి ఎల్లాల రాజిరెడ్డి,తదితరులు ఉన్నారు.