ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కిసాన్ చౌక్ లో ఇరువురు వ్యక్తులు మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ పడిన ఘటన బీర్ బాటిల్ తో దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. శనివారం క్రాంతి నగర్ కు చెందిన మహమ్మద్ జహీర్, మహారాష్ట్రకు చెందిన ఇసాక్ డబ్బుల కోసం గొడవపడ్డారు. ఈ క్రమంలో కోపంతో ఉన్న ఇసాక్ జహీర్ పై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. రీప్స్ భాగం లో బీరు బాటిల్ తో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది సాయి, వసీం లు గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ కు తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.