విజయవాడలో డయేరియాతో ఎవరు చనిపోలేదని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుహాసిని స్పష్టం చేశారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట లో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపు వద్ద నుండి ఆమె మీడియాతో మాట్లాడారు. డయేరియాతో చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.