తిరుపతి జిల్లా గూడూరు కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి బి. రాజేశ్ మాట్లాడుతూ.. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 104 కేసులు పరిష్కరించారు. రూ. 78,47,332 నగదును రికవరీ చేశామన్నారు