పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ బి వి ఎం భారతీయ విద్యార్థి మోర్ఛ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.. స్కాలర్షిప్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.