సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలోని మాల కాలనీ ఎస్సీ మాదిగ కాలనీ సినిమా టాకీస్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని శనివారం గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.