ఆదివారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం ఉదయం 7వరకు విశాఖ జిల్లా వ్యాప్తంగా దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. చంద్ర గ్రహణం సందర్భంగా పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేస్తారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి ప్రాతః కాల పంచామృతాభిషేకం అనంతరం ఏడు గంటలకు తిరిగి దర్శనాలకు అనుమతిస్తారు. విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం, సింహాచలం నృసింహస్వామి ఆలయం, రుషికొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయనున్నారు.