Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల మైనార్టీ హాస్టల్ పాఠశాలను గురువారం ఉదయం 9 గంటలకు అధికారులతో కలిసి ఆకస్మిక తనికి చేశారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే ,అనంతరం విద్యార్థులకు ఉదయం పెడుతున్న టిఫిన్ ను వంటశాలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఆహారంలో కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే గండ్ర.