కామారెడ్డి పట్టణంలోని పురాతన కిష్టమ్మ గుడి ని కామారెడ్డి శాసన సభ్యులుకాటిపల్లి వెంకట రమణ రెడ్డి సందర్శించారు. పురాతన చరిత్ర కలిగిన కిష్టమ్మ గుడి లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. కామారెడ్డి పుర ప్రముఖుల అందరితో కలిసి పురాతన ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.