కౌతాళం :మండలం ఊరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శుభ్రతను పాటించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ప్రతీ నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. తడి, పొడి చెత్తపై ప్రజలు అవగహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆలయంలో పరిశుభ్రతపై ఆరా తీశారు.