వైఎస్ఆర్సిపి అన్నదాత పోరు కార్యక్రమానికి నందిగామకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు 30 యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లక్ష్మీపురం జాతీయ రహదారిపై ఏసీపీ స్థాయి అధికారులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుండి నందిగామ కు వెళ్లే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.