ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరద ప్రవాహం పెరిగి కొమురం భీం అడ ప్రాజెక్టులోకి 13,681క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై మంగళవారం ఉదయం 1.50మీటర్ల మేర 4 గేట్లను ఎత్తి 12,639 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్సకారులు వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.