మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలను బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు హాస్టల్ ను తనిఖీ చేశామని అన్నారు. హాస్టల్ లో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ పై కూడా నివేదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.