అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి మండలం రజాపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తాడిపత్రికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో దంపతులు రాఘవేంద్ర, హర్షిని అనే దంపతులకు గాయాలయ్యాయి. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.