Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఆకాశలక్కవరంలో ఎరువులు పంపిణీకి సిద్ధమైన టిడిపి నాయకులు,వైసిపి టిడిపి నాయకుల మధ్య ఘర్షణ, నెలకొన్న ఉద్రిక్త వాతావరణం

Srikakulam, Srikakulam | Sep 13, 2025
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సకాలంలో ఎరువులు కూటమి ప్రభుత్వం అందించలేదని వైకాపా శ్రేణులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో... శనివారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామంలో ఎరువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు లేకుండా కేవలం స్థానిక టిడిపి నాయకులు ఎరువులు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి కి చెందిన రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది... అనంతరం టిడిపికి చెందిన స్థానిక నేతలపై వైకాపాక వర్గీయులు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us