ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన కుంపట్ల సత్య నారాయణ ఆలమూరులోని జొన్నాడ వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన ఎస్ఐ తన సిబ్బందితో కలిసి జాలర్ల సహాయంతో పడవపై వెళ్లి, గోదావరిలో కొట్టుకుపోతున్న సత్య నారాయణను రక్షించారు. అనంతరం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.