తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కారు యూరియా ఇవ్వడం లేదని, గత మూడు రోజులుగా తిరుగుతున్నా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లేపల్లి సొసైటీ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లడేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.