సిగాచీ పరిశ్రమ బాధితుల కోసం పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ఓ గార్డెన్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జేఏసీ జిల్లా ఛైర్మన్ వై.అశోక్ కుమార్ అన్నారు. పటాన్ చెరులో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ హాజరవుతున్నారని చెప్పారు