శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో బుధవారం రాత్రి 8 గంటలకు స్థానిక గ్రామస్తులతో ఆముదాలవలస సీఐ దివాకర్ యాదవ్ ఎస్ఐకే వెంకటేష్ సమావేశం నిర్వహించారు.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఓట్లు లెక్కింపు అనంతరం ఎటువంటి ఊరేగింపులు చేయవద్దని 144 సెక్షన్ అమలులో ఉందని అవగాహన కల్పించారు... జూన్ 6వ తేదీ వరకు ఆంక్షలు ఉన్నాయని వివరించారు ప్రజలు తమకు సహకరించాలని కోరారు...