కుప్పం హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన సత్యసాయి జిల్లాకు చెందిన నాగిరెడ్డిని అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి తెలిపారు. హంద్రీనీవాతో పాటు ప్రభుత్వ పెద్దలపై మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. హంద్రీనీవాపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ పత్రికపై సైతం కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.