ఆదిలాబాద్ నుంచి కప్పర్ల వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో, బండల్ నాగపూర్, పొచ్చెర గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. బస్సు ఒక వైపు వంగిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును కదలకుండా ఆపేశారు. ఇదే సమయంలో ఒక ఆటో కూడా బురదలో కూరుకుపోవడంతో పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దుస్థితి కారణంగా అటువైపు వెళ్లేందుకు ఆర్టీసీ డ్రైవర్లు భయపడుతున్నారు.