మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రా ఆటోవాలా అమలాపురం యూనియన్ అధ్యక్షుడు రాయుడు ప్రసాద్ అన్నారు. ఈ నెల 12న అమలాపురం నల్ల వంతెన వద్ద నిర్వహించే నిరాహార దీక్ష విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.