షాద్నగర్ పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కి అప్పగించడంపై మంగళవారం మధ్యాహ్నం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విచారణ పేరుతో సిబిఐకి అప్పగించి కొత్త కుట్రలకు పాల్పడుతుందని అన్నారు.