శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆమె ప్రజలకు వివరించారు.