అయినవిల్లి మండలం పరిధిలోని ముక్తేశ్వరం-ఎదురుబిడియం కాజ్వే వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ముక్తేశ్వరం కాజ్వే ఆదివారానికి ఇంకా వరద ముంపులోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు వరదనీటిలో రాకపోకలను సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాయంత్రానికి కాజ్వేపై ప్రవాహం తగ్గే అవకాశం ఉందన్నారు.