ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడీల పైన అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు అని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ అన్నారు. నేడు గురువారం రెండు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పూలే చౌరస్తా నుండి బస్టాండ్ వరకు లంబాడి హక్కుల పోరాట సమితి, ఎల్ హెచ్ పి ఎస్, లంబాడి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. బంజారా లంబాడీలు సింధు నాగరికత కాలం నుండి ఈ దేశ మూల నివాసులని భారతదేశ స్వతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ పిటిషన్ దాఖలు చేయ