Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కాకుండా అర్హులకు ఇవ్వాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్

Asifabad, Komaram Bheem Asifabad | Aug 27, 2025
ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కాకుండా అర్హులకు ఇవ్వాలని BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాంకిడి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం నాటికి నిరహార దీక్ష 3వ రోజుకు చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగినప్పటికీ కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కమిటి సభ్యులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఆయన ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us