విజయనగరం జిల్లా విజయనగరం మండలంలోని కొండకరకాం గ్రామానికి చెందిన గంగరాజు అనే (22) ఏళ్ల యువకుడు ఆర్థిక సమస్యల కారణంగా గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగిన గంగరాజును స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి అతను మృతిచెందాడు. ఈ ఘటనపై విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.