సిపిఐ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ మక్తల్ నియోజకవర్గ కార్యదర్శి అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం కొంకనోనిపల్లి లో ఆయన విలేకరుల సమావేశంలో సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడారు.రెండు రోజులపాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.