Download Now Banner

This browser does not support the video element.

రామన్న‌పేట: రైతులకు యూరియా ను అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

Ramannapeta, Yadadri | Sep 1, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా : రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి జిల్లా నాయకులు, సింగిల్విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరచారి విమర్శించారు. సోమవారం రామన్నపేట తహసిల్దార్ కార్యాలయం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుందని అయినా రైతు సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం జరిగిందని, పిఎసిఎస్ కార్యాలయాల వద్ద రైతులు యూరియా కోసం చిన్నపిల్లలతో వచ్చి క్యూలైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us